కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి మండవ

by Sridhar Babu |
కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి మండవ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బోదన్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మండవ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. మండవతో పాటు నిజామాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ అజార్ కిషన్ రావు, తారా చంద్ నాయక్ పార్టీలో చేరారు.

Next Story

Most Viewed