సొంతూరులో జరిగి దసరా వేడుకల్లో పాల్గొన్న సినీ నిర్మాత దిల్ రాజు

by Mahesh |   ( Updated:2024-10-13 05:16:49.0  )
సొంతూరులో జరిగి దసరా వేడుకల్లో పాల్గొన్న సినీ నిర్మాత దిల్ రాజు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లికి వచ్చారు. శనివారం ఆయన నర్సింగ్ పల్లి లోని ఇందూరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు పేద పండితులు నిర్వహించిన పూజా కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొన్నారు. ఆయన వెంట హీరో ఆశిష్ కూడా ఉన్నారు. ఉత్సవాల్లో తనను కలిసిన గ్రామస్తులతో దిల్ రాజ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వారం ఆలయంలో జరిగే స్వామివారి పల్లకి ఊరేగింపు సేవలో కూడా దిల్ రాజు హీరో ఆశిష్ తో కలిసి భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు.

Advertisement

Next Story