రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

by Naveena |
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
X

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి - సిరిసిల్ల రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన గంగని రాములు (50) ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బైక్ పై వెళ్తున్నాడు. ఉదయం 5.30 గంటల సమయంలో కామారెడ్డి - సిరిసిల్ల రహదారిపై వెళ్తుండగా.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలవడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story