- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ ముందు
దిశ, కామారెడ్డి : నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ ముందు వరుసలో ఉంటుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో దిశ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తుందన్నారు. డైనమిక్ ఎడిషన్ ల పేరిట ప్రతిరోజూ మూడు ఎడిషన్ లను
అందజేయడంతో పాటు వెబ్ లింకు వార్తలను అందించడంలో అన్ని పేపర్ల కంటే ముందు వరుసలో దిశ ఉందన్నారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ దిశ పేపర్ చదవడం అలవాటు చేసుకున్నారన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న దిశ యాజమాన్యానికి, రిపోర్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ ఆర్సీ ఇంచార్జ్ పెరుమాండ్ల రాజు, క్రైమ్ రిపోర్టర్ గడ్డమీది సంజీవ్, బీజేపీ నాయకులు విపుల్ జైన్, లక్ష్మారెడ్డి, తేలు శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, బాలకిషన్, సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.