దిశ ఎఫెక్ట్... విద్యుత్​ తీగలు సరి చేసిన అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... విద్యుత్​ తీగలు సరి చేసిన అధికారులు
X

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలోని బండారి రాములు జొన్న పంట చేను మీదుగా ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగల వలన జొన్న వంట కాలిపోవడంతో ఆ రైతు దిశ పత్రికను ఆశ్రయించాడు. దీంతో ఫిబ్రవరి 29 న విద్యుత్ తీగల నుంచి మంటలు చెలరేగి జొన్న చేను దగ్ధం అనే శీర్షికపై దిశ పత్రికలో ప్రచురించగా విద్యుత్ ట్రాన్స్కో ఏఈ స్పందించారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ పనులను చేపట్టి రైతులకు ఉపశమనం కలిగించారు. దీంతో ఆ రైతులు దిశ పత్రిక కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed