వెంటనే ఎస్బీఐ, బీజేపీ అక్రమ విరాళాల వివరాలు చెప్పాలి

by Sridhar Babu |
వెంటనే ఎస్బీఐ, బీజేపీ అక్రమ విరాళాల వివరాలు చెప్పాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్ పథకం వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశించినప్పటికీ బీజేపీ బయట పెట్టక పోవడం ప్రజలను మోసం చేయడమేనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద గల ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2017 నుండి రాజకీయ పార్టీలు తీసుకున్న ఎలక్ట్రోరల్ బాండ్ (విరాళాలు) వివరాలను బహిర్గతం చేయాలని, వాటిని ఎలక్షన్ కమిషన్ కు 6 మార్చి 2024వ తేదీ వరకు అప్పగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశించినా బీజేపీ విరాళాల వివరాలను

ఇంకా అందించలేదని ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగంలో అధునాతన సాంకేతికత ద్వారా కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ద్వారా క్షణాల్లోనే లావాదేవీలు బయటికి వచ్చే టెక్నాలజీ ఉన్న కూడా కేవలం బీజేపీతో తమకు ఉన్న చీకటి ఒప్పందం కారణంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ విరాళాల వివరాలను బహిర్గతం చేయలేక పోతుందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారులకు తొత్తుగా మారి వారి నుండి కోట్ల రూపాయల నల్లధనం విరాళాల పేరుతో తమ ఖాతాలో జమ చేసుకుందని విమర్శించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ విరాళాల వివరాలను బయట పెడితే బీజేపీ అసలు బండారం బయటపడుతుందని భయంతో మోడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై ఒత్తిడి తెచ్చి వారి వివరాలు బయటకు రాకుండా చూస్తున్నాడని,

దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలియజేశారు. వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 నుండి బీజేపీ ఎలక్ట్రోరల్ బాండ్ (అక్రమ విరాళాల) వివరాలను బహిర్గతం చేయాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ బీజేపీ ఎలక్ట్రోరల్ బాండ్ పేరుతో కార్పొరేట్ కంపెనీల నుండి అక్రమ సంపాదనను విరాళంగా తీసుకుందని, ఎస్బీఐ, బీజేపీ కలిసి చీకటి ఒప్పందం నడుపుతున్నాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయడానికి జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్రాంచ్ ముందు ధర్నా చేస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, పీసీసీ మాజీ కార్యదర్శి రాంభూపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్​ఎస్​యూఐ అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్, వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, మక్లోర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి, చందూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, విజయ్ పాల్, వినయ్,పంచరెడ్డి చరన్, మోస్ర నర్సారెడ్డి, నందిపెట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, రుద్రుర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్, స్వామి గౌడ్, కైసర్, వినోద్, వరుణ్, నరేందర్ గౌడ్, రాజ గగన్, మహేందర్, మధు సుదన్, సంజయ్, నవీన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed