అండర్ ట్రయల్ ఖైదీ మృతి

by Sridhar Babu |
అండర్ ట్రయల్ ఖైదీ మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతం కు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు రాగా తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed