దళిత బంధు నిధులు మంజూరు చేయాలి

by Sridhar Babu |
దళిత బంధు నిధులు మంజూరు చేయాలి
X

దిశ, కామారెడ్డి : జిల్లాలోని దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. డాక్యుమెంటేషన్ పూర్తయిన లబ్ధిదారులందరికీ వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి దళితులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. దళిత నాయకులు ప్రేమ్ కుమార్, స్వామి, బాలమని, రవి, రాజు, నర్సింహులు, ఎల్లమ్మ, రాజయ్య, రవి, లింగం, బాల్ రాజు, ధన్ రాజ్, నర్సింలు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed