పేకాట స్థావరంలో పట్టుబడ్డాడు...స్వాతంత్య్ర వేడుకల్లో దర్శనమిచ్చాడు...

by Sridhar Babu |
పేకాట స్థావరంలో పట్టుబడ్డాడు...స్వాతంత్య్ర వేడుకల్లో దర్శనమిచ్చాడు...
X

దిశ, ఆలూర్ : ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎండి. రఫిక్ పాషా ఆదివారం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై జరిగిన దాడుల్లో పట్టుబడ్డారు. ఆయనపై జిల్లా కేంద్రంలోని నాలుగో టౌన్ లో కేసు నమోదు కాగా , గురువారం రోజు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విషయం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్ ను ఈ విషయంపై సంప్రదించగా నాలుగవ టౌన్ నుంచి వచ్చిన కేసుని పుటప్ చేసి జిల్లా కలెక్టర్ కు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పంపించామని దిశకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed