అజాగ్రత్త ఒకరి ఆయువు తీసింది

by Sridhar Babu |
అజాగ్రత్త ఒకరి ఆయువు తీసింది
X

దిశ, కామారెడ్డి : మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఒకరిని వెనుక నుండి వస్తున్న డీసీఎం ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. దేవునిపల్లి ఎస్ఐ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన బుయ్య మల్లయ్య (51) అనే వ్యక్తి మంగళవారం టీవీఎస్ ఎక్సెల్ పై కామారెడ్డికి వస్తుండగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ శివారులో గల దేవి విహార్ వద్ద ఎల్లారెడ్డి వైపు నుండి వస్తున్న డీసీఎం ఢీకొన్నట్టు తెలిపారు. దీంతో మల్లయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నర్సింలు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఢీకొన్నట్లు వివరించారు. మృతునికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed