తాళం వేసిన ఇంట్లో చోరీ

by Sridhar Babu |
తాళం వేసిన ఇంట్లో చోరీ
X

దిశ, ఆర్మూర్ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని బీచ్ గల్లీకి చెందిన గోక లత తన తండ్రి మృతి చెందడంతో అంత్యక్రియలకు బాల్కొండ మండలంలోని నాగం పేటకు వెళ్లి పది రోజులుగా అక్కడే ఉంటుంది. ఇంటికి తాళం వేసి ఉందని, ఉదయం లత వదిన స్వరూప వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని సమాచారాన్ని శనివారం ఇవ్వగా లత ఇంటికి వచ్చి చూడగా బీరువాలను పగలగొట్టి అందులో నుండి 15 తులాల బంగారం, 20 తులాల వెండి, మూడువేల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లి గుర్తించారు. లత భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆర్మూర్ ఎస్సై అశోక్ పరిశీలించి చోరీ జరిగిన తీరును తెలుసుకొని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు.

Next Story

Most Viewed