సాగర్ కెనల్లో మృతదేహం లభ్యం

by Sridhar Babu |
సాగర్ కెనల్లో మృతదేహం లభ్యం
X

దిశ, కోటగిరి : కోటగిరి మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ లో మృతదేహం లభ్యమైందని స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నసురుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సయ్యద్(83) శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో గాలించగా నిజాంసాగర్ కెనాల్ వద్ద చెప్పులు, చేతి కర్ర విడిచి కాలకృత్యాల కొరకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది కెనాల్ లో కొట్టుకొని వచ్చి ఎక్లాస్పూర్ గ్రామ శివారు వద్ద మృతదేహమై లభ్యమైనట్టు తెలిపారు. మృతుడి కుమారుడు చాంద్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story