మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

by Sridhar Babu |
మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత
X

దిశ, నవీపేట్ : మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 33 లీటర్ల మద్యం బాటిళ్ల ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. డీపీఈఓ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మండలం లోని నాగేపూర్ లోని బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన రూట్ వాచ్ లో వాహనాలను తనిఖీ చేయగా బాసర నుండి నవీపేట్ వైపు వస్తున్న కారులో మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న 33.5 లీటర్ల 28 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. బసకొండ మనోజ్, గడ్డం పవన్ లను అరెస్ట్ చేసి ఎస్హెచ్ఓ నిజామాబాద్ కు అప్పగించారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిబ్బంది సాగర్ రావ్, సలీమ్, గోపి, కార్తీక్, కిరణ్, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed