బెదిరించి భూ కబ్జా చేసిన కేసులో మరొకరి అరెస్ట్

by Sridhar Babu |
బెదిరించి భూ కబ్జా చేసిన కేసులో మరొకరి అరెస్ట్
X

దిశ, కామారెడ్డి : దేవునిపల్లిలో బెదిరించి బలవంతపు భూ కబ్జా చేసి, ప్రహరీ గోడకు ఉన్న సిమెంటు ప్లేట్స్ ధ్వంసం చేసిన కేసులో ఇదివరకే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపగా బుధవారం దేవునిపల్లి కి చెందిన ఉరుదొండ రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అయిదుగురిని రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడినా, ఎవరినైనా భూముల విషయంలో బెదిరించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed