మందుల కోసం వెళ్లి మృత్యువాత

by Sridhar Babu |
మందుల కోసం వెళ్లి మృత్యువాత
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ్ నగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన జడల నరేష్ అనే వ్యక్తి మాత్రల కోసం వెళ్లి మృత్యువాత పడ్డాడు. మీసంపల్లి గ్రామ శివారులో చెట్టుకు బైక్​ను ఢీ కొట్టి నరేష్​ మృతి చెందాడు. మృతుడి భార్య జడల స్వరూప ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. మృతుడి భార్య జడల స్వరూప తెలిపిన వివరాల ప్రకారం జడల స్వరూప భర్త నరేష్ ( 24)తో కలిసి అడ్లూరు ఎల్లారెడ్డి సదాశివ్ నగర్ మండలమైన తన తల్లి గారి ఇంటి వద్ద దేవత పండుగ ఉండడంతో

రెండు రోజుల క్రితం భర్తతో వచ్చింది. అనంతరం నరేష్​కు టాబ్లెట్లు అవసరం ఉన్నందున శివాపూర్ నుండి ఎల్లారెడ్డికి స్వరూప తమ్ముడు అరవింద్ తో కలిసి ఎల్లారెడ్డికి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా మీసంపల్లి గ్రామ శివారు మార్గమధ్యలో చెట్టుకు ఢీ కొట్టారు. దాంతో నరేష్​కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్వరూప తమ్ముడు అరవింద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా వారు వచ్చి ఎల్లారెడ్డి లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed