- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మందుల కోసం వెళ్లి మృత్యువాత
దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ్ నగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన జడల నరేష్ అనే వ్యక్తి మాత్రల కోసం వెళ్లి మృత్యువాత పడ్డాడు. మీసంపల్లి గ్రామ శివారులో చెట్టుకు బైక్ను ఢీ కొట్టి నరేష్ మృతి చెందాడు. మృతుడి భార్య జడల స్వరూప ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. మృతుడి భార్య జడల స్వరూప తెలిపిన వివరాల ప్రకారం జడల స్వరూప భర్త నరేష్ ( 24)తో కలిసి అడ్లూరు ఎల్లారెడ్డి సదాశివ్ నగర్ మండలమైన తన తల్లి గారి ఇంటి వద్ద దేవత పండుగ ఉండడంతో
రెండు రోజుల క్రితం భర్తతో వచ్చింది. అనంతరం నరేష్కు టాబ్లెట్లు అవసరం ఉన్నందున శివాపూర్ నుండి ఎల్లారెడ్డికి స్వరూప తమ్ముడు అరవింద్ తో కలిసి ఎల్లారెడ్డికి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా మీసంపల్లి గ్రామ శివారు మార్గమధ్యలో చెట్టుకు ఢీ కొట్టారు. దాంతో నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్వరూప తమ్ముడు అరవింద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా వారు వచ్చి ఎల్లారెడ్డి లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.