ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్

by Sridhar Babu |
ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్
X

దిశ, ఆర్మూర్ : మండలంలోని మంథని గ్రామంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి శనివారం షాక్ తగిలింది. ఆర్మూర్ మండలం మంథని గ్రామ ఎంపీటీసీ సభ్యుడు గొల్ల గంగారాం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా మంథని కి చెందిన పాపాయి గారి రమేష్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. గంగారాం యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగా ఉండి పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేసేవారు. అయితే స్థానిక బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోక పోవడం, పార్టీ కార్యకలాపాల గురించి సమాచారం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందాడు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు గంగారాం యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం కోసం కష్టపడి పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు జైడి శ్రీనివాస్ రెడ్డి, పాపాయి గారి లింగారెడ్డి, రవి గౌడ్, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed