‘బిల్లు కట్టనిదే.. డెడ్ బాడీ ఇవ్వం’.. నిజామాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి దారుణం

by Satheesh |
‘బిల్లు కట్టనిదే.. డెడ్ బాడీ ఇవ్వం’.. నిజామాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి దారుణం
X

దిశ, నిజామాబాద్ సిటీ: డబ్బుల కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు. రెగ్యులర్ డాక్టర్లు లేకున్నా ఆన్ కాల్‌పై డాక్టర్లను రప్పించే కొన్ని ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో రోగులను దోచేస్తున్నాయి. తీరా వైద్యం చేసి ఫీజులు కట్టకపోతే వారి వేధింపులు అంతా ఇంతా కావు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అప్పగించేందుకు పెండింగ్ బిల్లును ఇస్తే గాని డెడ్ బాడీ ఇవ్వమని పేచిపెట్టిన సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. దానితో మృతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల ప్రకారం.. గత నెల 5వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సిద్ది నయూమ్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి ప్రూడేన్స్ హాస్పిటల్‌లో బంధువులు చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే నయూమ్ తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. మొన్నటి వరకు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు బుకాయింపుకు పాల్పడడం జరిగిందని.. గురువారం నుండి నయూమ్‌ను చూపించడానికి వైద్యులు నిరాకరించారు అని మృతుడి బంధువులు తెలిపారు.

అనుమానం వచ్చిన తమకు నయూమ్‌ను చూపించాల్సిందిగా డాక్టర్లను బలవంతం పెట్టడంతో.. నయూమ్ మృతి చెందినట్లు చెప్పారన్నారు. రూ.2 లక్షల బిల్లు కట్టాలని.. లేకపోతే మృతదేహం ఇవ్వమని ఆసుపత్రి యాజమాన్యం తెలపడంతో మృతుని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి తగ్గి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. డబ్బుల కోసం ఎంత నీచనికైనా పాల్పడతారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story