సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం

by Sridhar Babu |
సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, పిట్లం : పిట్లం గద్దగూడ నుండి నాగంపల్లి తండాకు వెళ్లే రోడ్డులో స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు వెల్లడించారు. మృతదేహం సగం కాలిపోయి, ఎండిపోయి ఉంది. మహిళను 20 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ 25 నుండి 35 ఏళ్ల వయసు కలిగి ఉండి బ్లూ కలర్ చీరె, పింక్ కలర్ బ్లౌజ్ , చేతికి పసుపు ఎరుపు రంగు గాజులు, కాళ్లకు పట్టీలు ధరించి ఉందని తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పిట్లం ఎస్సై నీరేష్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed