క్షణికావేశంలో కొడుకును హతమార్చిన తండ్రి

by Sridhar Babu |
క్షణికావేశంలో కొడుకును హతమార్చిన తండ్రి
X

దిశ, గాంధారి : క్షణికావేశంలో కొడుకును తండ్రి చంపిన ఘటన గాంధారి మండల కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే స్థానికులు, గాంధారి ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జులు గ్రామానికి చెందిన బానోవత్ సురేష్ ( 27) ఆయన తండ్రి వసంతరావు చేతిలో హతమయ్యాడు. సురేష్ పై కత్తితో దాడి చేయడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళితే తాగిన మైకంలో బుధవారం రాత్రి సురేష్ కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది.

అది కాస్త పెద్దది కావడంతో సురేష్ తండ్రి వసంతరావు కొడుకును కోపంతో కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం తన కుమారుడిని చంపానని బాధతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. అది చూసిన ఇరుగుపొరుగు వారు వసంతరావును గాంధారి హాస్పిటల్​కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కామారెడ్డికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గాంధారి ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed