ప్రాజెక్టులు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం : కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
ప్రాజెక్టులు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం : కోమటిరెడ్డి
X

దిశ,మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తిచేసి ఈ ప్రాంత అభివృద్ధిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతానని భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మర్రిగూడలో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.

పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల కూపన్ లోకి నెట్టిందని ఆయన కుటుంబమే బాగుపడిందని అందుచేతనే కవిత జైల్లోకి వెళ్లిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలకు జైలు కూడు తప్పదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం, వృద్ధాప్య వితంతువులకు పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆదరించినట్టే చామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదరించి మునుగోడు లో లక్ష మెజార్టీ ఇవ్వాలని కోరారు.

మే 13న జరిగే పోలింగ్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేసి లోక్ సభ కి పంపిస్తే మునుగోడు అభివృద్ధి తానే చూసుకుంటానని తన మీద నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక యువజన నాయకుడు వీరమల్ల లోకేష్ నాగలిని రాజగోపాల్ కు బహూకరించాడు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్, శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు, జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, మర్రిగూడ మాజీ సర్పంచ్ మాసం నీలిమ, చంద్రశేఖర్, ఎంపీటీసీ వెంకటంపేట, బాలయ్య అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చౌరస్తాలో భారీగి ఘన స్వాగతం

ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మర్రిగూడ చౌరస్తాకు వచ్చిన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కార్యకర్తలు భారీ క్రేన్ తో పూలమాలవేసి ఘనంగా సన్మానించారు. మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలతో స్వాగతం పలికారు. మర్రిగూడ చౌరస్తా నుండి మర్రిగూడ కొత్త బస్టాండ్ వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు.



Next Story

Most Viewed