- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ సందడి
దిశ, ఖమ్మం సిటీ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారాన్ని చేపట్టారు. తొలుత ఖమ్మం మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ర్యాలీ లో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. భద్రాచలంలో శ్రీరాముడు ఎలాగో ఖమ్మంలో రఘురాం రెడ్డి కూడా అదే విధంగా ఉంటారని, ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తమ
ఓటు హక్కును వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విక్టరీ వెంకటేష్ ని చూసేందుకు భారీగా చేరుకున్న అభిమానులు కేరింతల మధ్య కాంగ్రెస్ పార్టీ నినాదాలు హోరెత్తాయి. ఒకవైపు ఖమ్మం నగరం జనసంద్రంతో నిండిపోతే మరోవైపు వర్షం దంచి కొట్టింది. అయినా విక్టరీ వెంకటేష్ వర్షాన్ని లెక్కచేయకుండా ప్రజలకు తన అభివాదాన్ని మాత్రం ఆపలేదు. ఆయన వెంట రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, అభ్యర్థి రఘురాం రెడ్డి, జిల్లా అధ్యక్షులు పువ్వల్లా దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్, రాయల నాగేశ్వరరావు, కమర్థపు మురళి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.