దిశ ఎఫెక్ట్..దర్జాగా కబ్జా అనే వార్తకు స్పందించిన అధికారులు

by Naveena |
దిశ ఎఫెక్ట్..దర్జాగా కబ్జా అనే వార్తకు స్పందించిన అధికారులు
X

దిశ,కోదాడ : ఈనెల 19వ తేదీన దిశ దిన పత్రికలో దర్జాగా కబ్జా అనే వార్తకు ప్రభుత్వ భూములను కాపాడేదెవరు? అనే శీర్షికతో ప్రచురించారు. దీంతో ఈ వార్తకు ఆర్డీవో సూర్యనారాయణ స్పందించారు. అనంతగిరి ఎమ్మార్వో హిమబిందు రెవెన్యూ సిబ్బందితో కలిసి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతగిరి మండలం ఖానాపురం ఆవాస గ్రామం అజ్మీర తండాలో ఉన్న ప్రభుత్వ భూమి రెండు ఎకరాలను సర్వేయర్ తోటి సర్వే చేపించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ స్థలం చుట్టూ బౌండరీస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story