సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

by Naveena |
సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీజేపీ సీనియర్ ‌నాయకులు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరిలో జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ అధ్యక్షతన జరిగిన భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సభ్యత నమోదు సమీక్ష సమావేంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అన్ని మెంబర్షిప్ పూర్తి చేసి పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. ఈ నెల 27 వరకు సభ్యత్వం పూర్తి చేసి బూత్ కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేయడానికి నాయకులు, కార్యకర్తలు పూర్తి సమయం ఇచ్చి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రబారి చాడ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, సాగర్, మల్లేశం, పడాల శ్రీనివాస్, జిల్లా సభ్యత ప్రముఖు రాచకొండ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, ఊట్కూర్ అశోక్ గౌడ్, ఎన్నం శివకుమార్, వేముల అశోక్ పడమటి జగన్మోహన్ రెడ్డి సురకంటి రంగారెడ్డి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం కోప్పుల యాదిరెడ్డి పట్నం కపిల్, పట్నం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story