AP News:వంగూరు డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు

by Jakkula Mamatha |
AP News:వంగూరు డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు
X

దిశ, ఏలూరు: డిస్టిలరీస్ పై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాలలో భాగంగా ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు వద్ద ఉన్న గౌతమీ డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గత నాలుగేళ్లలో లిక్కర్ అంశంపై అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ ఈ దాడి చేసింది. తనిఖీలలో ఆరుగురు అధికారులు, 15 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం నుంచి సాగుతున్న తనిఖీలు రాత్రి వరకు కూడా కొనసాగుతున్నాయి. డిస్టిలరీలో రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. గత నాలుగు సంవత్సరాల నుంచి జే బ్రాండ్లు ను ఎంత మద్యం తయారు చేశారు. అధికారికంగా, అనధికారికంగా ఎన్ని వేల లీటర్ల మద్యాన్ని విక్రయించారని అంశాలపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు.

Advertisement

Next Story

Most Viewed