ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

by Mahesh |
ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని వైద్యశాఖ భావిస్తున్నది. కొత్తగా ఏర్పాటయ్యే హాస్పిటళ్లకు ఈ టరిఫ్​లను వర్తింపజేయనున్నది. ప్రస్తుతం క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు తక్కువగా ఉన్నాయని భావించిన వైద్యశాఖ, పడకలు వారీగా ఫీజులు నిర్ణయించాలని ఆలోచిస్తున్నది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 200 పడకలు, ఆ పై ఉన్న పెద్దాస్పత్రికి రూ.16 వేలు మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీ ఉన్నది. దీన్ని పెంచాలని వైద్య శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed