200 దేశదారు బాటిళ్లు స్వాధీనం

by Sridhar Babu |
200 దేశదారు బాటిళ్లు స్వాధీనం
X

దిశ, రామగుండం : రామగుండం రైల్వే స్టేషన్ వద్ద 200 దేశదారు (ఒక రకమైన నాటు సారా) బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ ఎస్సై, సిబ్బంది పట్టుకొని అతని వద్దనున్న బ్యాగ్ ను తనిఖీ చేయగా 200 దేశదార్ బాటిళ్లని గుర్తించారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇతను మహారాష్ట్రకు చెందిన ఎర్కిచేతల రాజమల్లు పోచంగా తెలిపాడని, మహారాష్ట్ర నుంచి రైలు మార్గం ద్వారా దేశదారు తీసుకొచ్చి రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయించేందుకు వచ్చినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరించారు. నిందితున్ని, అతని వద్ద స్వాధీనం చేసుకున్న దేశదార్ బాటిళ్లని తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed