బెంగుళూర్ లో కూలిన బిల్డింగ్.. శిథిలాల కింద 17 మంది!

by M.Rajitha |   ( Updated:2024-10-22 13:27:54.0  )
బెంగుళూర్ లో కూలిన బిల్డింగ్.. శిథిలాల కింద 17 మంది!
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగుళూర్(Bengaluru) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు నగరంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. కాగా భవన శిథిలాల కింద 17 మంది చిక్కుకున్నట్టు అధికారులు వెల్లడించారు. బెంగుళూరులోని బాబుసపల్య ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారకోశం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిలో పలువురు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం.

Advertisement

Next Story