లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..

by Sumithra |
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..
X

దిశ, మిర్యాలగూడ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 72 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలకు ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. అంతకు ముందు పట్టణంలోని షాబునగర్, ముత్తిరెడ్డి కుంట, తాళ్లగడ్డ, రాంనగర్ లాంటి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, వరద నీరు నిలువ ఉండకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story