పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత

by Naveena |
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత
X

దిశ,నాగార్జున సాగర్: శ్రీశైలం నుంచి నాగార్జున సాగ‌ర్ వైపు కృష్ణ‌మ్మ ఉర‌క‌లేస్తోంది. దీంతో కృష్ణా న‌ది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగ‌ర్‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంటోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి..నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం.. 312.50 టిఎంసిలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ : 312 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 2,10,149.క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,10,149..క్యూసెకులుగా కొనసాగుతుంది.

సాగర్ కు పర్యాటకుల తాకిడి..

నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తిన విషయం తెలుసుకొని జలాశయం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో సందడి మారింది. సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడిని పర్యాటకులు తమ సెల్ ఫోన్లలోబంధించుకుంటున్నారు. సాగర్‌ అందాలను తిలకించడానికి పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధ వనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృ హం వెనక ఉన్న నూతన లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది.

Advertisement

Next Story

Most Viewed