ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

by Kalyani |
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే
X

దిశ, నార్కట్ పల్లి : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేట మండలంలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని వెల్లడించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధిలో రాజీలేదన్నారు. గత ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. రాబోయే నెలలో ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని గంటపదంగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామపంచాయతీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలన్నారు. కార్యకర్తలంతా సమిష్టి కృషితో పనిచేసి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూస బాలకిషన్ బాలమణి, జెడ్పిటిసి ఉన్న లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story