- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కొత్త సీసాల్లో పాత వైన్..క్రిమినల్ చట్టాలపై రిటైర్డ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
![కొత్త సీసాల్లో పాత వైన్..క్రిమినల్ చట్టాలపై రిటైర్డ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు కొత్త సీసాల్లో పాత వైన్..క్రిమినల్ చట్టాలపై రిటైర్డ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు](https://www.dishadaily.com/h-upload/2024/07/03/348625-chalameshwar.webp)
దిశ, నేషనల్ బ్యూరో: జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలు ‘కొత్త సీసాల్లో పాత వైన్’లాంటివని అభివర్ణించారు. ఈ చట్టాలపై అనేక సందేహాలున్నాయని తెలిపారు. కొన్ని మార్పులు చేర్పులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో ప్రవేశపెట్టిన మార్పుల ప్రకారం.. కేసు విచారణలలో అనవసరమైన జాప్యాన్ని నివారించడానికి కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలను అనుమతించాయి. విచారణ ముగిసిన 45 రోజులలోపు కేసు తీర్పులను తప్పనిసరిగా అందించాలి. మొదటి విచారణ జరిగిన 60 రోజులలోపు అభియోగాలను రూపొందించాలి. కోర్టులు ఇంత కఠినమైన గడువులను ఎలా అందజేస్తాయి’ అని ప్రశ్నించారు. భారతదేశంలోని 80 శాతానికి పైగా కోర్టు వ్యవస్థలో ప్రాథమిక డిజిటల్ సౌకర్యాలు లేవని, కొత్త చట్టాలను అమలు చేయడంలో ఇది పెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడ్డారు. బెయిల్ నిబంధనలు సైతం కఠినంగా మారాయని తెలిపారు.