‘సారిపల్లి’ఎన్నో సాంస్కృతిక సంస్థలకు అండగా నిలిచారు

by Sridhar Babu |
‘సారిపల్లి’ఎన్నో సాంస్కృతిక సంస్థలకు అండగా నిలిచారు
X

దిశ, రవీంద్రభారతి : ‘సారిపల్లి’ఎన్నో సాంస్కృతిక సంస్థలకు అండదండలందిస్తున్నారు అని ఎమ్మెల్యే డా. మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దివంగత కాసుబ్రహ్మనందరెడ్డి , కోట్ల విజయభాస్కరరెడ్డి , డాక్టర్ మర్రిచెన్నారెడ్డి, నారా చంద్రబాబునాయుడు వంటి ఉద్దండులకు అత్యంత సన్నిహితులుగా మెలిగారని, గత 49 సంవత్సరాలుగా ఎన్నో సాంస్కృతిక సంస్థలకు అండదండలందిస్తూ ముఖ్యంగా యువకళావాహిని సంస్థకు ప్రధాన పోషకులుగా

ఉంటూ కొన్నివేల కార్యక్రమాలకు చేయూత నందించిన దాత సారిపల్లి కొండలరావు అని అన్నారు. బుధవారం యువ కళావాహిని ఆధ్వర్యంలో జంట నగరాల సాంస్కృతిక సంస్థ సమన్వయంతో రవీంద్రభారతి ప్రధాన మందిరంలో సారిపల్లి కొండల రావు కు సహస్ర పూర్ణ చంద్రదర్శన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ డా. కేవీరమణ, ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, డా. మామిడి హరికృష్ణ హాజరయ్యారు. అతిథులు సారిపల్లి ని ఘనంగా సన్మానించి పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

Next Story

Most Viewed