బైరామలగూడ చెరువును ఆధునీకరించండి

by Sridhar Babu |
బైరామలగూడ చెరువును ఆధునీకరించండి
X

దిశ, ఎల్బీనగర్ : బైరాములగూడ చెరువులోని పూడిక తీసి చెరువును ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సిబ్బందిని నియమించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్​ను కోరారు. బుధవారం ఉదయం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ లు నియోజకవర్గంలోని పలు డివిజన్లను సందర్శించారు.

ఈ సందర్భంగా డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్​కు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు జగ్గయ్య, సుల్తానా, అధికారులు అశోక్ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్ నాయక్, సత్యం చారి, కుమార్ రెడ్డి, రాఘవేంద్ర, రామకృష్ణ, ప్రవీణ్, శేఖర్, హరికృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed