పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే

by Naveena |
పేదల  అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే
X

దిశ, వేములపల్లి :పేద ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మొల్కపట్నం గ్రామంలో రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులందరికీ త్వరలోనే ఇందిరమ్మ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,తహసిల్దార్ సాదత్, డిప్యూటీ తాసిల్దార్ కోటేశ్వరి, ఆర్ఐ స్పందన, వేములపల్లి పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ పాధురి గోవర్ధన, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలి కాంతరెడ్డి, నాయకులు రావు ఎల్లారెడ్డి, పుట్టల కృపయ్య, పుట్టల శ్రీనివాస్, పరశురాములు, బుసిరెడ్డి వెంకట్రెడ్డి, రెమడాల కరుణాకర్,నగేష్,భారీ పాండు,ఆంజనేయులు, వెంకన్న, సురేందర్,జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story