కోపంతో మైక్ కింద పడేసిన ఎమ్మెల్యే ఎందుకో తెలుసా..?

by Naveena |
కోపంతో మైక్ కింద పడేసిన ఎమ్మెల్యే ఎందుకో తెలుసా..?
X

దిశ,ఆలూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసంగా మారింది. ఎంఐఎం కౌన్సిలర్ షాదీ ముబారక్ చెక్కులు బాన్స్ అవుతున్నాయని ఎమ్మెల్యేతో వాగ్వాదం దిగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నా దగ్గరికి వస్తే సమస్యను పరిష్కరించే వాడినని, అధికారుల చుట్టూ తిరుగుతే ఏం లాభమని అసహనం వ్యక్తం చేస్తూ..మైకు ను కింద పడేశారు. అక్కడున్న విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఎమ్మెల్యేను సముదాయించారు. అంతకముందు చెక్కులు పంపిణీ కార్యక్రమం హాల్లోకి రానియలేదని , కాంగ్రెస్ నాయకులను అనుమతించారని , బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ..పోలీసులు అనుమతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story