- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
‘మా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాకు ఇవ్వండి..’
దిశ,సూర్యాపేట : గత ప్రభుత్వంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పటికి కూడా మాకు ఎందుకు ఇవ్వడం లేదని సూర్యాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పలువురు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిరుపేదలైన మాకు డ్రా ద్వారా ఇళ్ల కోసం ఎంపిక చేసినప్పటికీ తమకు ఇళ్ల కేటాయించలేక పోతున్నారని వాపోయారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ డ్రాలో పేరుపొందిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని కోరారు.
2023 అక్టోబర్ ఒకటిన నాటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హడావుడిగా కలెక్టరేట్ లో అర్హులైన నిరుపేదల ఇళ్ల కోసం లక్కీ డ్రా తీశారని అన్నారు.అక్టోబర్ 2న నాటి మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా సూర్యాపేటలో డ్రా పొందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారనీ వాపోయారు.గత ఏడాది నుండి ఇప్పటివరకు ఆ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం తామంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకు ఈ ప్రభుత్వం లోనైనా రాజకీయాలు చేయకుండా నిరుపేదలమైన మాకు ఇళ్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.