‘కోదండ రెడ్డి నీకు సిగ్గుందా’.. BRS ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్

by Satheesh |
‘కోదండ రెడ్డి నీకు సిగ్గుందా’.. BRS ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభాకర్ అనే రైతు సెల్ఫీ సూసైడ్ రాష్ట్రంలో పొలిటికల్ దూమారం రేపుతోంది. కాంగ్రెస్ నేతల వలనే ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. బీఆర్ఎస్ నేతల ప్రోద్భలంతోనే ప్రభాకర్ సూసైడ్ చేసుకున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత కోడండరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోదండరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన రైతు ప్రభాకర్ తాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని మరణ వాంగ్మూలం ఇస్తే.. అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గు లేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. A1గా ఉన్న కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త కూరపాటి కిషోర్‌ని పోలీసులు A8గా మార్చారన్నారు. రైతు ప్రభాకర్ చనిపోవడానికి ముఖ్య కారణమైన కూరపాటి కిషోర్‌ని నిందితుల జాబితాలో ఎందుకు స్థానం మార్చారో పోలీసులు చెప్పాలి లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు A8గా మార్చారు.. మార్పు వెనకాల ఏ శక్తులు ఉన్నాయని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed