‘మందకృష్ణ, మోత్కుపల్లి బీజేపీకి సపోర్టు చేయడం విచిత్రంగా ఉంది’

by Disha Web Desk 2 |
‘మందకృష్ణ, మోత్కుపల్లి బీజేపీకి సపోర్టు చేయడం విచిత్రంగా ఉంది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ దళితుల్ని మోసం చేస్తుందని ఎమ్మెల్సీ మహేష్​కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో ప్రసంగించారు. కులగణన చేస్తామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పారు. కానీ బీజేపీ ఇప్పటి వరకు తన స్టాండ్‌ను ప్రకటించలేదన్నారు. దేశంలో అసమానతలు పూర్తిగా తొలగాలంటే ఇంకా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇది కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. తాను అగ్రకులంలో పుట్టినా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అండగా ఉంటానన్నారు. దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నది? ఎందుకో ప్రజలకు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

స్కాలర్ షిప్ రద్దు కావడం, కుల వివక్షతోనే రోహిత్ చనిపోయారన్నారు. రోహిత్ దళితుడు కాదని పోలీసులు కుల సర్టిఫికేషన్ ఎట్లా ఇస్తారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జెల కాంతం మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నెహ్రూ నుంచి మొదలు, ప్రభుత్వాలు ఏవైనా రిజర్వేషన్లను కొనసాగిస్తూ వస్తున్నారన్నారు. సవరణల పేరిట రాజ్యాంగాన్ని మార్చారు కాని, రిజర్వేషన్లు తొలగించలేదన్నారు. కానీ బీజేపీ పూర్తిగా తొలగిస్తా అని ప్రయత్నాలు మొదలు పెట్టడం దారుణమన్నారు. పైగా నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న ఆలోచనలను అడ్డుకోవాల్సిన మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకే సపోర్టు చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు.

Next Story

Most Viewed