వరదలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు: ఎమ్మెల్యే దానం నాగేందర్

by Mahesh |   ( Updated:2024-09-02 15:30:20.0  )
వరదలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు: ఎమ్మెల్యే దానం నాగేందర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద సంభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వరదలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వరదలపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారు అని.. జిల్లాల మంత్రులు ప్రజల్లో ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వరదలను భూతద్దంలో పెట్టి చూపిస్తూ.. ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు. వక్రీకరించే మాటలను బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని.. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు సలహాలు ఉంటే ఇవ్వాలని.. విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed