నేటి నుంచి గాంధీభవన్ లో మంత్రుల విజిట్స్

by M.Rajitha |
నేటి నుంచి గాంధీభవన్ లో మంత్రుల విజిట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కార్యకర్తల సమస్యల పరిష్కారం కొరకు గాంధీభవన్ లో బుధవారం నుంచి స్పెషల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి వారం ఇద్దరు మంత్రుల అనే ప్రోగ్రామ్ ను టీపీసీసీ గాంధీభవన్ లో ఏర్పాటు చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ హాజరు కానున్నారు. మంత్రి ముఖాముఖీ కోసం ఇందిరా భవన్ లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసిన టీపీసీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పాలన, ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా తన ఆలోచనలు ఉంటాయన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికీ, కార్యకర్తగానే పనిచేస్తానన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. తాను వీలైంత వరకు డైలీ గాంధీభవన్ కు వస్తుంటానని, తనతో పాటు వారానికి ఇద్దరు మంత్రులు కచ్చితంగా ఉండేలా షెడ్యూల్ తయారు చేశామన్నారు. కార్యకర్తలకు సంక్షేమం, సమస్యలు పరిష్కారానికి కృషి చేసినప్పుడే పార్టీకి, ప్రభుత్వానికి విలువ పెరుగుతుందన్నారు.

Next Story

Most Viewed