Uttam Kumar Reddy: గవర్నర్ ను కలిసిన మంత్రి ఉత్తమ్

by Prasad Jukanti |
Uttam Kumar Reddy: గవర్నర్ ను కలిసిన మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో భేటీ అయ్యారు. బుధవారం రాజ్ భవన్ కు తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేపు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటనపై చర్చించారు. కాగా రేపు ఉదయం 10:30 గంటలకు గవర్నర్ సూర్యాపేట కలెక్టరేట్ కు చేరుకోనున్నారు. 11:30 గంటల వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం ఉండనున్నది. అనంతరం శాఖల వారీగా లక్ష్యాలను గవర్నర్ కు అధికారులు వివరించనున్నారు. అనంతరం జిల్లాలోని కవులు, కళాకారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed