రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటీ కీలక సమావేశం

by Y. Venkata Narasimha Reddy |
రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటీ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రెవెన్యూ సంస్కరణలకు సంబంధించి చర్చించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులలో కీలక భేటీ నిర్వహించారు.రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు, నూతన రెవిన్యూ చట్టంపై చర్చ, ధరణి పోర్టల్ సమస్యలులపై అధికారులతో మంత్రి పొంగులేటి చర్చిస్తున్నారు. అలాగే రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై ఈ భేటీలో అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చిస్తు కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన నూతన ఆర్వోఆర్ చట్టాన్ని యాచారంతో పాటు నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా అమలులోకి తెచ్చారు. డిసెంబర్ నాటికి పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ చేయాలన్న లక్ష్యంతో పాటు, అటవీ భూముల హక్కులపై అనుసరించాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed