Eatala: భారత్ అనేక రంగాల్లో దూసుకుపోతోంది.. ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
Eatala: భారత్ అనేక రంగాల్లో దూసుకుపోతోంది.. ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ అనేక రంగాల్లో దూసుకుపోతోందని, భారత జాతి కీర్తిని పెంచడంలో యువత నడుం బిగించాలని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నెక్లెస్ రోడ్‌లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ.. ప్రపంచానికి కరువు వస్తే.. ఆకలైతే అన్నం పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎదిగింది కానీ భారత్ కి ఏమైనా అవస్థ వస్తే సాయం చేసే స్థాయి ఏ దేశంకి లేదని మేధావులు ఆర్టికల్‌లో రాశారని అన్నారు. కరోనా వచ్చినప్పుడు చైనాలో వెయ్యి పడకల ఆసుపత్రిని ఆగమేఘాల మీద నిర్మించుకున్నారని, చైనా కాబట్టి తట్టుకున్నది అదే భారత్ అయితే శవాల గుట్టలు అయిపోయేవి అని మాట్లాడారని, కానీ భారతదేశమే మొట్టమొదట కరోనా వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచ దేశాలకు అందించిందని గుర్తు చేశారు.

ఇక క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చర్లపల్లిలో కడుతున్న టర్మినల్ చూస్తే క్వాలిటీ ఏంటో తెలుస్తుందని, ఎయిర్ పోర్ట్‌ను తలపించే పద్ధతిలో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అలాగే అనేక రంగాలలో భారత్ దూసుకుపోతుందని, అమెరికాలో ఉన్న డాక్టర్లలో క్వాలిటీ డాక్టర్స్ మన ఇండియన్సే అని అన్నారు. దేశంలో క్వాలిటీ మాన్ పవర్ ఉండి.. ఏఐ వచ్చిన తర్వాత అన్ని పనులు రోబో చేస్తే మనం ఎక్కడికి పోవాలని, ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పారు. శాస్త్ర విజ్ఞానం ఎదగాలి. కానీ ఆ విజ్ఞానం మనిషిని పనిలో పెట్టేలా ఉండాలని తెలిపారు. దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిన మ్యాన్ పవర్‌ని దేశ అభివృద్ధిలో ఎలా భాగం చేయాలని చెప్పి.. నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారని వివరించారు. మనం ఎంప్లాయ్‌మెంట్ కోసం తపనపడటంతో పాటు ఎంప్లాయ్‌మెంట్ కల్పించడంలో కూడా తోడ్పడాలని సూచించారు. భారత జాతి కీర్తి పతాకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా యువతను ఈటల కోరారు.

Advertisement

Next Story