- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP Govt:గుడ్ న్యూస్.. రేపు వారి అకౌంట్లో డబ్బులు జమ
దిశ,వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయనిధికి పలువురు దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఏపీ సర్కార్ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురి బ్యాంకు ఖాతాలో ఇప్పటికే నగదు జమ చేసింది. అయితే సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు(సోమవారం) డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.