పుంగనూరు బాలిక హత్య కేసు.. ఇద్దరి అరెస్టు

by Jakkula Mamatha |
పుంగనూరు బాలిక హత్య కేసు.. ఇద్దరి అరెస్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన పుంగనూరు బాలిక హత్య కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. పుంగనూరులో సెప్టెంబర్ 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన బాలిక ఆ తర్వాత అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. మూడ్రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో హత్య కేసు సంచలనంగా మారింది. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణమంటూ పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి అజ్మతుల్లా నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారం లో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారి తీశాయని ఎస్పీ వెల్లడించారు.

ఓ మహిళ సహా 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. ప్రచారం జరుగుతున్నట్లుగా చిన్నారిపై అత్యాచారం జరగలేదని ఎస్పీ మణికంఠ తేల్చి చెప్పారు. ఆ విషయం పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని ఆయన చెప్పారు. గత నెల 29న సాయంత్రం బుర్కా వేసుకుని వచ్చిన ఓ మహిళ బాలికకు చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయిందని, అనంతరం చిన్నారి నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఎస్పీ తెలిపారు. అనంతరం ఆస్తీయా మృతదేహాన్ని నిందితులు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.

.

Advertisement

Next Story