లంబాడీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలి : విజయ్ నాయక్

by Y.Nagarani |
లంబాడీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలి : విజయ్ నాయక్
X

లంబాడీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం (టిడిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు విజయ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9నెలలు గడుస్తున్న మంత్రి వర్గంలో లంబాడీలకు స్థానం కల్పించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో లంబాడీలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్ర మొత్తంలో 12% ఉన్న గిరిజనులకు మంత్రి వర్గంలో చోటు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. క్యాబినెట్ విస్తరణలో తప్పకుండ లంబాడీలకు మంత్రి పదవి ప్రకటించాలన్నారు. లేదంటే లంబాడీలందరినీ కలుపుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకులు సురేందర్ నాయక్, నరహరి, వెంకన్న, యాకు, రమేష్, తిరుమల్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed