గీత కార్మికులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. చెట్ల పైనుంచి కిందపడకుండా కిట్ల పంపిణీ

by Gantepaka Srikanth |
గీత కార్మికులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. చెట్ల పైనుంచి కిందపడకుండా కిట్ల పంపిణీ
X

దిశ, వెబ్‌డెస్క్: గీత కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక మీద నుంచి ఒక్క గీత కార్మికుడు కూడా చెట్ల మీద నుంచి కిందపడి చనిపోయే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అలా చెట్ల మీద నుంచి కిందపడకుండా ఆధునిక టెక్నాలజీతో కిట్లను రూపొందించామని తెలిపారు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లను నాటి గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సేఫ్టి కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు అందజేస్తున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. మరోవైపు ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన గీత కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story