గణపతి లడ్డూను దొంగిలించిన దొంగ..

by Sumithra |
గణపతి లడ్డూను దొంగిలించిన దొంగ..
X

దిశ, మేడ్చల్ టౌన్ : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా చోరీ ఘటనల గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే చోరీ చేసేవాళ్ళు బంగారం, వెండి, డబ్బలను చోరీ చేస్తుంటారు. కానీ ఓ దొంగ మాత్రం తనకు ఆకలి వేసిందో ఏమో గానీ వెరైటీగా గణేష్ లడ్డూను చోరీ చేశాడు. పూర్తి వివరాల్లోకెళితే మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు రాఘవేంద్ర నగర్ కాలనీలో సాయి సదన్ అపార్ట్మెంట్ లో గణేష్ లడ్డూ చోరీకి గురైంది. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ లోకి చొరబడి లడ్డు చోరీ చేశారు. లడ్డు చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed