సంగారెడ్డిలో కిడ్నాప్ అయిన శిశువు క్షేమం

by M.Rajitha |   ( Updated:2024-10-10 15:46:58.0  )
సంగారెడ్డిలో కిడ్నాప్ అయిన శిశువు క్షేమం
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన ఆడశిశువును పోలీసులు రక్షించారు. నిందితులు హైదరాబాద్ లోని బోరబండలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. సిటీ పోలీసుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న శిశువును కాపాడారు. కిడ్నాపర్ల చెరనుండి విడిపించిన శిశువును పోలీసులు సంగారెడ్డికి తీసుకు వస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మానూరు మండలం దూదిగొండకు చెందిన ఓ మహిళ కాన్పుకోసం మంగళవారం రాత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. ఆడశిశువుకు జన్మనిచ్చిన కాసేపటికే.. ఆ శిశువు కనబడకుండా పోయింది. శిశువు అపహరణకు గురైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సీసీ టీవీ ఫుటేజీ గమనించిన పోలీసులకు బాధిత మహిళా ప్రసవ సమయంలో ముగ్గురు మహిళలు అనుమానస్పదంగా తిరగడం గమనించి, వారి కోసం పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుకున్న పోలీసులు వారి నుండి శిశువును రక్షించారు. ఈ ఘటనలో నలుగురు నిదితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed