ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే

by Aamani |
ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే
X

దిశ,కొల్చారం: ప్రజా ప్రతినిధులు, రాజకీయాల పార్టీల నాయకులు అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటేనే వారికి సముచిత గుర్తింపు ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధికి తమ పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులే చివరి వరకు గుర్తింపునిస్తాయన్నారు. నాయకులు పదవులతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం పనిచేయాలన్నారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంపీటీసీలు సభ్యులు సర్పంచులు ఎంపీపీ జడ్పీటీసీ పనిచేయాలని సూచించారు గ్రామాల్లో సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు . ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ జడ్పీటీసీ సభ్యులు ముత్యం గారి మేఘమాల సంతోష్ వైస్ ఎంపీపీ మల్లారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు ఉదయ వేమారెడ్డి భాగ్యలక్ష్మి సిద్ధిరాములు ఆదం మాధవి రాజా గౌడ్ తదితరులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో లక్ష్మీ నరసింహులు, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు వివిధ పార్టీల నాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story